News February 3, 2025
శావల్యాపురం: కాలువలో పడి తూ.గో జిల్లా యువకుడి మృతి

శావల్యాపురం మండలం ఘంటవారిపాలేం కాలువలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి రాజేశ్ (25)గా గుర్తించారు.
Similar News
News February 22, 2026
ట్రంప్ రిసార్ట్లోకి అగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ

US అధ్యక్షుడు ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని కాల్చి చంపారు. లొంగిపోవాలని సూచించగా అతను గన్ పైకెత్తడంతో కాల్పులు జరిపి అంతమొందించారు. ఘటన జరిగినప్పుడు ట్రంప్ వాషింగ్టన్లో ఉన్నారు. సముద్రతీరంలో నిర్మించిన ఈ రిసార్టును ట్రంప్ 1985లో కొనుగోలు చేశారు. దీన్ని వింటర్ వైట్హౌస్ అని పిలుస్తారు.
News February 22, 2026
అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.
News February 22, 2026
WGL: రేపు TG Ed.CET-2026 నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Ed.CET-2026) నోటిఫికేషన్ రేపు (సోమవారం) విడుదల కానుంది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎడ్ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్సైట్ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు రేపటి నుండి కీలక తేదీల వివరాలను తెలుసుకోవచ్చు.


