News February 2, 2025
శావల్యాపురం: కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

శావల్యాపురం మండలం ఘంటేవారిపాలెం కాలువలో ఆదివారం ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
సూర్య ఘర్పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News December 4, 2025
NZB: ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష

పంచాయతీ ఎన్నికల భద్రత చర్యలపై డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉమ్మడి నిజమాబాద్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా వివరించారు. డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. NZB సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News December 4, 2025
TU: డిగ్రీ పరీక్షలకు 51 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని డిగ్రీ I, III, V, (రెగ్యులర్)& II, IV, VI సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం జరిగిన పరీక్షలకు 4,887 మంది విద్యార్థులకు 4,664 మంది హాజరు కాగా 233 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 299 మందికి గాను 271 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.


