News February 2, 2025
శావల్యాపురం: కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

శావల్యాపురం మండలం ఘంటేవారిపాలెం కాలువలో ఆదివారం ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
ట్రెండింగ్.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 14, 2025
ఇక్కడ అద్దెకు బాయ్ఫ్రెండ్స్ లభించును

ఏంటి షాక్ అయ్యారా? బెంగళూరులో వాలంటైన్స్ డే సందర్భంగా ‘రెంట్ ఏ బాయ్ఫ్రెండ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.389 చెల్లిస్తే చాలు మీకు ఆ రోజుకు ప్రియుడు దొరికినట్లే. నగరంలోని చాలా చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ సంస్కృతి చైనా, జపాన్, థాయ్లాండ్లో ప్రాచుర్యం పొందింది. ఇది నగర సంస్కృతికి ముప్పుగా భావించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు.
News February 14, 2025
విశాఖ: పోలీసుల అదుపులో డ్రగ్స్ నిందితులు

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన షేక్ ముధఫర్, మహమ్మద్ చాంద్, షేక్ అనీష్ విశాలాక్షి నగర్లో <<15460513>>బ్రౌన్ షుగర్ <<>>అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్ ఫోర్స్, ఆరిలోవ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.