News March 18, 2025
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపై రాజు మాట్లాడుతూ.. అది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే దీనిపై రాజు స్పందిస్తూ.. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ విమర్శించారు.
Similar News
News February 23, 2026
ఖమ్మం ఎంసీహెచ్లో తగ్గుతున్న ప్రసవాలు

ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది. వైద్యుల సమయపాలన లోపం, పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ సమీక్ష నిర్వహించి.. గైనకాలజీ విభాగం వైద్యులు సమయపాలన పాటిస్తూ, పర్యవేక్షణ పెంచాలని గట్టిగా ఆదేశించారు.
News February 23, 2026
అనకాపల్లి: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని మోడల్స్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
News February 23, 2026
ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.


