News March 13, 2025

శాసనసభ్యుల క్రీడల పోటీలకు సిద్ధం చేయండి: కమిషనర్

image

శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడలో గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే శాసనసభ్యుల క్రీడల పోటీలకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 26, 2025

SKLM: నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

image

నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంవద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలియజేశారు. ITI అర్హత కలిగి ఎలక్ట్రిషన్‌లో అనుభవం ఉండాలన్నారు. 30 ఏళ్లు కలిగి https://apssdc.inloలో నమోదు చేసుకోవాలన్నారు.

News October 26, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు: CBN

image

AP: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాను’ అని ట్వీట్ చేశారు.

News October 26, 2025

అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు: కలెక్టర్

image

మొంథా తుపాను నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 29 వరకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సముద్రతీర ప్రాంతాలు ప్రాంతాల్లో తిరగవద్దని కలెక్టర్ నాగరాణి సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ రద్దు చేశామని చెప్పారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.