News November 12, 2024
శాసనసభ విప్లుగా ముగ్గురు కడప జిల్లా ఎమ్మెల్యేలు

కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్తో పాటు 15 మంది విప్లను ప్రకటించింది. ఇందులో కడప జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. వీరిలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి(TDP), జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(BJP), కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(జనసేన)ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. NDA ప్రభుత్వం కడప జిల్లాలో మూడు పార్టీలకు సమన్యాయం చేశారని కూటమి నాయకులు భావిస్తున్నారు.
Similar News
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.
News December 4, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00
News December 4, 2025
కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.


