News November 20, 2024

శాసన మండలిలో మంత్రి లోకేశ్ ఆగ్రహం

image

శాసమండలిలో ప్రతిపక్ష నేతల తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ ఆగ్రహించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతుండగా అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. సభను ఉద్దేశించి మాట్లాడకుండా అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటూ ఆక్షేపించారు. సభను కంట్రోల్‌లో ఉంచాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇటు హోం మంత్రి అనిత సైతం ప్రతిపక్ష సభ్యులపై ఫైర్ అయ్యారు.

Similar News

News July 11, 2025

గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

image

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

News July 11, 2025

GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.

News July 11, 2025

GNT: రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ప్రతిభావంతులకు అవకాశం

image

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.