News February 12, 2026
శాస్త్రవేత్తలతో కలెక్టర్ మహేశ్ కుమార్ భేటీ

క్వాయర్ పరిశ్రమల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా ఎగుమతులను పెంచవచ్చని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో కేరళ కొచ్చి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో క్వాయర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ, నూతన సాంకేతికత వినియోగంపై చర్చించారు. కోనసీమ కొబ్బరి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
టీజేఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్గా సత్యనారాయణ

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా రావుల సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.గౌరీ నియామకపత్రం విడుదల చేశారు. సత్యనారాయణ నేటి నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ తదితర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News March 13, 2026
RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
News March 13, 2026
ఆసిఫాబాద్లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.


