News February 27, 2025

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

image

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Similar News

News February 24, 2026

కర్ణాటక Vs జమ్మూ.. నేటి నుంచి రంజీ ఫైనల్

image

ఒకవైపు ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ నేటి నుంచి రంజీ ఫైనల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్‌, స్మరణ్‌ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్‌ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేక పటిష్ఠ కర్ణాటకకు తలొగ్గుతుందా చూడాలి.

News February 24, 2026

కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

image

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.

News February 24, 2026

పార్వతీపురం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పార్వతీపురం జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరవదికంగా 2024- 25, 2025-26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు www.apms.apcfss.in
సంప్రదించాలన్నారు.