News February 27, 2025
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News September 14, 2025
కరీంనగర్: 6 నెలలుగా జీతాలు ఇవ్వట్లే..!

ఉమ్మడి KNR జిల్లాలో పనిచేస్తున్న 11 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, సమయానికి వేతనం చెల్లించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై CM రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
News September 14, 2025
మల్టీపర్పస్ పార్క్ లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం

KNR ప్రజలకు ఆహ్లాదం కోసం రూ.11 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఎంట్రీ ఫీజు ₹20కి బదులు ₹50 వసూలు చేస్తున్నారు. అలాగే పిల్లల ఆటలకు, ఫుట్పాత్పై పార్కింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పార్క్ను కమర్షియల్ పార్క్గా మార్చారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
News September 14, 2025
IOCLలో 523 అప్రెంటిస్లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<