News March 23, 2024

శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Similar News

News November 25, 2025

FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

image

ట్రాన్స్‌జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్‌జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.

News November 25, 2025

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

image

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

News November 25, 2025

HYD: బాక్సు ట్రాన్స్‌ఫార్మర్లతో బేఫికర్!

image

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.