News March 1, 2025

శివరాంపల్లి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును పరిశీలించిన హైడ్రా కమిషనర్ 

image

శివరాంపల్లిలో శుక్రవారం రాత్రి భుమ్రుక్ ఉద్దీన్ దౌలా సరస్సును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో సరస్సు అభివృద్ధి పనుల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని సరస్సులను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2025

హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

image

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్‌ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

News March 1, 2025

HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్‌లో టూరిస్టులు అధికంగా జూ పార్క్‌కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT

News March 1, 2025

మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

image

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

error: Content is protected !!