News February 19, 2025
శివరాత్రికి రెడీ అవుతున్న వేములవాడ

వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి జాతర నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన, ప్రత్యేక క్యూలైన్స్, ధర్మగుండం సమీపంలో అభివృద్ధి పనులు బుధవారం చేపట్టారు. పటిష్ట బందోబస్తు భద్రత నడుమ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 12, 2025
నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

దేశ వ్యాప్తంగా SBI ఆన్లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.
News March 12, 2025
చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.
News March 12, 2025
రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.