News February 26, 2025

శివరాత్రి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి

image

శివరాత్రి సందర్భంగా తమ్మిలేరులో పుణ్యస్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు.  ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తిమ్మపాలెం గ్రామానికి చెందిన మినీయ్య, మారేషు‌లు పెదవేగి మండలం నడిపల్లి గ్రామ శివారు మునిపల్లి గ్రామం వద్ద ఉన్న తమ్మిలేరులో పుణ్య స్నానానికి దిగారు. ఒక్కసారిగా వారు నీటిలో గల్లంతయ్యారు. ఎన్‌డి ఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.

Similar News

News December 15, 2025

యాదాద్రి: ‘ఎన్నికల డ్యూటీ ట్రైనింగ్ డబ్బులివ్వాలి’

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీ అలాట్ అయిన సిబ్బందికి రెండు రోజుల ట్రైనింగ్ డబ్బులు ఇవ్వలేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దేశ ఎన్నికల్లో ప్రొసైడింగ్ ఆఫీసర్‌గా డ్యూటీ అలాట్ కాకుండా 2nd ఫేజ్ అలర్ట్ అయిన వారికి డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి, వలిగొండ మండల వారికి న్యాయం చేయాలని Way2News ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

News December 15, 2025

వనపర్తి జిల్లాలో 81 గ్రామాలకు ఈనెల 17న ఎన్నికలు

image

మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామ పంచాయతీలు 806 వార్డులకు గాను చిన్నంబావిలో గడ్డబస్వాపూర్, పానగల్‌లో దావాజిపల్లి, బహదూర్ గూడెం, పెబ్బేర్‌లో పెంచికల్ పాడు,రాంపూర్ (6) గ్రామాల సర్పంచులు,104 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తెలిపారు. 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు బుధవారం ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

News December 15, 2025

BRS, కాంగ్రెస్ మద్దతు.. CPMకు కంఠాయపాలెం ఉప సర్పంచ్?

image

MHBD జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైనట్లు సమాచారం. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ 5, సీపీఐ(ఎం) 2, బీఆర్ఎస్ మద్దతుదారులు 2, అధికార కాంగ్రెస్ 1 వార్డు గెలిచారు. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క వార్డు సభ్యుడు బీఆర్ఎస్‌, సీపీఎంకు మద్దతు ఇవ్వడంతో వీరి బలగం 5కు చేరి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.