News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న సంగారెడ్డి

image

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో జహీరాబాద్, నారాయణఖేడ్‌‌లో పెద్ద ఎత్తున ర్యాలీలకు ప్లాన్ చేశారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు సంగారెడ్డి హోరెత్తనుంది.

Similar News

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

image

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.

News November 19, 2025

ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్‌ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.

News November 19, 2025

తోట్లవల్లూరు: మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

image

తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన మహిళ కూలి పనికి వెళ్లి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్ కాసింబి(40) మినుములు నూర్చడానికి గుంటూరు (D) కొల్లిపర (M) వల్లభారానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు ఎస్సై పి. కోటేశ్వరరావు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.