News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న భువనగిరి

image

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు భువనగిరి ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని బీజేపీ పట్టన అధ్యక్షుడు బలరాం తెలిపారు. హనుమాన్ వాడ నుంచి నల్గొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2026

రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

image

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

News April 19, 2026

సూర్యాపేటలో 163 BNSS అమలు: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు ఉంటాయని, గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష సమయాల్లో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

News April 19, 2026

లైసెన్స్‌ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్‌ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.