News April 8, 2025

శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

శిశు మరణాల రేటు తగ్గించడమే ఆరోగ్యశాఖ ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. గర్భిణీలకు ప్రసవం జరిగే వరకు ఆరోగ్య కార్యకర్తలు సూచనలను సలహాలు ఇచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం కృషి చేయాలన్నారు. సదస్సులో జిల్లా వైద్యాధికారి కోటచలం సిబ్బంది ఉన్నారు.

Similar News

News October 14, 2025

కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

image

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.

News October 14, 2025

స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

image

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్‌లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News October 14, 2025

లండన్ పర్యటనలో స్పీకర్ అయ్యన్న

image

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లండన్‌లోని యూకే పార్లమెంట్‌ను సందర్శించారు. అక్కడ పెద్దల సభ, సామాన్యుల సభ ఉపసభాపతులతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో కమిటీలు ఎలా పనిచేస్తాయి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మాట్లాడారు. యూకే పార్లమెంట్లో కమిటీ వ్యవస్థ పనితీరును, దానిని మరింత సమర్థవంతంగా మార్చే మార్గాలను తెలుసుకున్నారు.