News March 28, 2025
శెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం: మంత్రులు

తిరుపతి అర్బన్ మండలంలోని శెట్టిపల్లి భూముల సమస్యలను వచ్చేనెల చివరిలోపు పరిష్కరిస్తామని మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో శెట్టిపల్లె భూముల సమస్యలను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. శెట్టిపల్లి భూముల లబ్ధిదారులకు లాటరీ పద్ధతిపై ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు భూమి కేటాయిస్తామని మంత్రులు తెలిపారు.
Similar News
News February 25, 2026
VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 25, 2026
VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 25, 2026
కడప జిల్లాలో పలువురు SDCలకు పోస్టింగ్.!

జిల్లాలో పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. కడప TGP SDCగా శివరాముడు, KRRC SDCగా నాగరాజు, డిజాస్టర్ మేనేజ్మెంట్ DPMగా హరి ప్రసాద్, ముద్దనూరు GNSS SDCగా వెంకటేశ్వర్లు, రాజంపేట సోమశిల ప్రాజెక్టు SDCగా శివరామిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీరిలో కొందరికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు.


