News January 22, 2025

శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు: డీఎస్పీ

image

కడపలో ఈరోజు ఉదయం అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముడి కళ్యాణం శోభాయాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప సబ్ డివిజన్ పరిధిలోని 9 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు ఎవరైనా పాల్పడిన ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 16, 2025

కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

image

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.

News December 15, 2025

కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

image

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.

News December 15, 2025

దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు