News February 27, 2026

శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

image

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Similar News

News April 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News April 16, 2026

కోటబొమ్మాళి: యాక్సిడెంట్‌లో 38 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

image

కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారి పాకివలస సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. బైక్‌పై కూరగాయలను అమ్ముకొని తిరిగొస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు పొన్నాడ పేటకు చెందిన మురళి (38)గా గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

News April 16, 2026

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

image

భార్యను నాటు తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సోంపేట అదనపు జడ్జి కె.కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మ అనే మహిళను ఆమె భర్త జగ్గారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.