News May 20, 2024

శ్రీకాకుళంలో ఈఏపీ సెట్‌కు 999 మంది హాజరు

image

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ 25-2024 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష జరిగింది. ఎచ్చెర్లలోని రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసన్నపేటలోని ఒక కేంద్రం, టెక్కలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో 999 హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.

Similar News

News October 17, 2025

పలాస: అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించాలి

image

అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా SP కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.టెక్కలి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకోసం ఈప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ, ఆస్తి గొడవలు వంటివాటిపై దరఖాస్తులు అందాయన్నారు.

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 17, 2025

మెడిసిన్ ధరలు తగ్గుదలపై అందరికీ అవగాహన అవసరం: డీఎంహెచ్‌ఓ

image

ప్రజలు నిత్యం వినియోగించే మెడిసిన్ ధరలపై అవగాహన అవసరమని జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. అనిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్‌టీ సవరణల వలన మందులపై ధరలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయని ఆమె తెలిపారు. క్లినిక్‌లు, మెడికల్ షాపుల వద్ద తగ్గిన ధరల పట్టికలను బోర్డుల రూపంలో ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.