News March 11, 2025

శ్రీకాకుళంలో నిండు గర్భిణి మృతి..ప్రమాదం ఎలా జరిగిందంటే

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో జరిగిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల (M) కుంచాలకూర్మయ్యపేటకు చెందిన దుర్గరావు భార్య రాజేశ్వరి నిండు గర్భిణి. సోమవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా డే అండ్ నైట్ కొత్త జంక్షన్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. భర్తపై బైక్ పడిపోగా, ఆమె తొడ భాగంపై నుంచి బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News March 12, 2025

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్షలకు 427 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను RIO దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19,093 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 18,666 మంది హాజరైనట్లు వెల్లడించారు. 427 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఒక దగ్గర జరిగిందని స్పష్టం చేశారు.

News March 12, 2025

మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

image

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 12, 2025

నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

image

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్‌లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.

error: Content is protected !!