News January 31, 2025

శ్రీకాకుళంలో రథసప్తమి సంబరాలకు సర్వం సిద్ధం

image

అరసవల్లి రథసప్తమి వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

Similar News

News October 18, 2025

SKLM: రాష్ట్రస్థాయి విజేతగా శ్రీకాకుళం సన్‌రైజర్స్

image

విజయవాడలో రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్‌రైజర్స్ జట్టు మొదటి బహుమతి సాధించింది. కృష్ణాజిల్లా విజయం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఎస్.ఎస్.ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (ఐఏఎస్) శనివారం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బహుమతి గెలిచిన జిల్లా జట్టును డీఈఓ రవిబాబు అభినందించారు.

News October 18, 2025

మందస: 22 నెలల చిన్నారికి వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం

image

కేవలం 22 నెలల అతి పిన్నవయసులోనే మందస మండలం డిమిరియాకు చెందిన సీర మయూరి అద్భుత ప్రదర్శన కనబరిచింది. మయూరి తండ్రి సీర సంజీవ్ సాఫ్ట్వేర్, తల్లి శాంతి డాక్టర్‌గా కాగా.. శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడుతున్న చిన్నారి ఆసక్తిని గమనించి వారు తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 15 శ్లోకాలు చెప్పిన మయూరి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , IB రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకుంది.

News October 18, 2025

SKLM: అంబేడ్కర్ గురుకుల హాస్టళ్ల పనులు వేగవంతం చేయండి

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.