News August 27, 2024
శ్రీకాకుళంలో TODAY TOP NEWS

➥ ఉద్యోగాలపై కేంద్రం మంత్రి కీలక వ్యాఖ్యలు
➥ 6 నెలల్లో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పూర్తి
➥ తమ్మినేని పై ఎమ్మెల్యే కూన రవి ఘాటు వాక్యాలు
➥ హిరమండలం వంశధార కాలువలో దూకి వ్యక్తి మృతి
➥ ఇంజీనీరింగ్ ప్రవేశాలకు ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్
➥ పాలకొండ సబ్ కలెక్టర్గా యశ్వంత్ ➥ బాధితుని వద్దకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
➥ జి.సిగడాంలో రైలు నుంచి జారీ మహిళ మృతి
➥ బూర్జ ఆయకట్టలో దెబ్బతిన్న షెల్టర్లు
Similar News
News February 11, 2025
విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేసేది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఆమె కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.
News February 11, 2025
సోంపేట: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షావుకారి డిల్లేశ్వరరావు (75) మద్యం మత్తులో తన భార్య రత్నాలు(70)పై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, అందులో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు టీ దుకాణం నడిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై లవరాజు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 10, 2025
శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు

శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.