News February 25, 2026
శ్రీకాకుళం: అతి సార నియంత్రణకు జిల్లా అధికారులతో కమిటీ

శ్రీకాకుళంలో అతిసార నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పడింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశుసంవర్ధక శాఖ జేడీలతో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు.
Similar News
News April 14, 2026
తెలంగాణ ఫలితాల్లో సిక్కోలు వలస కూలీ బిడ్డ సంచలనం

వజ్రపుకొత్తూరు(M) గుణుపల్లికి చెందిన వలస కూలీ కుమార్తె గుండుపల్లి స్వాతి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో (MPC) 470కి 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ఈ మార్కులు సాధించగా, అందులో స్వాతి ఒకరు కావడం విశేషం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన స్వాతిని ఉద్దాన ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
శ్రీకాకుళం: CHOలకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 594 మంది CHO/MLHPల విధులపై ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8PM FRSను రద్దు చేస్తూ దానిని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేశారు. మహిళా CHOలకు ఇబ్బందిగా ఉన్న ఈ ప్రక్రియను రద్దు చేయడంపై జిల్లా CHOలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
News April 14, 2026
శ్రీకాకుళం: CHOలకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 594 మంది CHO/MLHPల విధులపై ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8PM FRSను రద్దు చేస్తూ దానిని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేశారు. మహిళా CHOలకు ఇబ్బందిగా ఉన్న ఈ ప్రక్రియను రద్దు చేయడంపై జిల్లా CHOలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.


