News April 9, 2024
శ్రీకాకుళం: అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

ఉమ్మడి శ్రీకాకుళంలో జిల్లాలో 2019ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. ఇచ్ఛాపురం- 69.5, పలాస-72.8, టెక్కలి-78.5, పాతపట్నం-70, ఆమదాలవలస-79, ఎచ్చెర్ల-84, నరసన్నపేట-79.6, రాజాం-73.8 పాలకొండ -73.9 శాతంగా నమోదైంది. కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 69 శాతం నమోదైంది. ఈ సారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి. కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2025
టెక్కలి: పట్టుమహాదేవి కోనేరును పరిశీలించిన కలెక్టర్

టెక్కలి పట్టుమహాదేవి కోనేరు గట్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. టెక్కలి రెవెన్యూ, పంచాయతీ, ఇంజినీరింగ్, మండల పరిషత్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కోనేరు పర్యాటక అభివృద్ధి చేయనున్న దృష్ట్యా పలు అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీభాయి తదితరులున్నారు.
News April 10, 2025
SKLM: సమస్యల పరిష్కారమే లక్ష్యం

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణం పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్కి చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
News April 10, 2025
శ్రీకాకుళం DMHOగా సుజాత

శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.