News April 29, 2024

శ్రీకాకుళం: అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పూర్తి

image

నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ అభ్యర్థులు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.

News April 15, 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు సిద్ధం

image

APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్‌పోర్ట్ రూట్‌లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.

News April 15, 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు సిద్ధం

image

APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్‌పోర్ట్ రూట్‌లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.