News May 4, 2024
శ్రీకాకుళం: ఆ ఛానెల్లో వచ్చిన వార్త అవాస్తవం

శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు శనివారం వెల్లడించారు. మూడు రోజులు పాటు 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉద్యోగులు వేచి ఉన్నట్లు తెలిపారు. ఓ ఛానల్లో నరసన్నపేటపై వచ్చిన వ్యతిరేక వార్త వాస్తవం కాదని సాఫీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుందని ఆర్వో రామ్మోహన్ స్పష్టం చేశారు.
Similar News
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.
News December 8, 2025
SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.


