News June 26, 2024
శ్రీకాకుళం: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 12వ స్థానం

కాసేపటి క్రితం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,113మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,047 మంది పాసయ్యారు. జిల్లాలో 43శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 12వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్ గ్రూప్లో 341 విద్యార్థులు రాయగా 187మంది పాసయ్యారు. దీనిలో 55శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.
Similar News
News January 3, 2026
శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
టెక్కలి: డివైడర్పై వృద్ధుడి మృతదేహం

టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రహదారి డివైడర్పై శుక్రవారం ఒక వృద్ధుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండలంలోని కంట్రగడ గ్రామానికి చెందిన వీ.ఆనంద్ (71) అనే వృద్ధుడు కొన్నేళ్లుగా టెక్కలిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మేరకు కాంప్లెక్స్ సమీపంలోని మృతిచెంది పడి ఉండడంతో స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యతో మృతిచెంది ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.
News January 3, 2026
SKLM: ‘రైల్వే గేట్లు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.


