News April 12, 2025
శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులారా.. GET READY

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 18, 2025
బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్లో భాగంగా బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.
News April 18, 2025
నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్లో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
News April 18, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గురువారం ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో కలిసి కుప్పిలి సంఘటనలో ఉపాధ్యాయుడుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కలెక్టర్ని కోరారు. హెచ్ఎం ప్రమోషన్ సీనియారిటీ లిస్టులో ఉన్న ఇద్దరి పైన కూడా ఛార్జెస్ పెండింగ్ను క్లియర్ చేసి ప్రమోషన్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.