News April 13, 2024
శ్రీకాకుళం :ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.
News September 30, 2024
అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం
అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.
News September 30, 2024
సారవకోట: అత్యాచార కేసులో నిందితుడి అరెస్ట్
సారవకోట మండలంలో ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన బుద్దల హేమసుందరరావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ విచారణ చేశారన్నారు. యువకుడి అరెస్ట్ అనంతరం పాతపట్నం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.