News June 28, 2024

శ్రీకాకుళం: ఈసెట్-2024 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

Similar News

News September 20, 2024

టెక్కలిలో రూ.4 కోట్ల విద్యుత్ బకాయి.. పరిశ్రమకు కరెంట్ కట్

image

టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.

News September 20, 2024

శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News September 20, 2024

శ్రీకాకుళం: పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మాజీ స్పీకర్ సీతారాం

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి MP సెగ్మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమదాలవలస మాజీ MLA తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్లు YCP అధినేత జగన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో, MLAలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పదవులు కేటాయించినట్లు సమాచారం.