News July 18, 2024
శ్రీకాకుళం: ఈ నెల 21న గ్రూప్-2 మాక్ టెస్ట్

ఎర్రన్న విద్యాసంకల్పం ద్వారా ఈ నెల 21న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యాధరి డిగ్రీ కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి కళాశాల, పలాస మదర్ థెరిసా పాఠశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు https://bit.ly/YVSexam లింక్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్ను అడిగి తెలుసుకున్నారు.
News July 10, 2025
శ్రీకాకుళంలో నేడు ఉద్యోగ మేళా..!

శ్రీకాకుళంలోని బలగ గవర్నమెంట్ ఐటిఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ ఫార్మాసిటికల్ కంపెనీలో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇంటర్, డిప్లొమా మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో హాజరవ్వాలన్నారు.
News July 10, 2025
మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత: SP

మహిళలు భద్రతకు జిల్లా పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యత, బాధ్యతగా తీసుకుంటుందని SP మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళల భద్రతపై విస్తృత స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రజానీకానికి, జిల్లాలో గల పోలీస్ స్టేషన్ ద్వారా చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.