News February 10, 2025
శ్రీకాకుళం: ఈ రోజు ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం ఆదాయ వివరాలను ఈవో భద్రాజి వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.6,78,600 లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,16,454లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ.2,68,175లు వచ్చాయన్నారు. మొత్తం రూ. 10,63,229 సమకూరినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 28, 2025
వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.
News March 27, 2025
వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.
News March 27, 2025
పొందూరు: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొందూరు- దూసి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి పడడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి, ఎరుపు రంగు షార్ట్, తెలుపు రంగు బనియన్ ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ నెంబర్ 9493474582ను సంప్రదించాలన్నారు.