News January 30, 2025
శ్రీకాకుళం: ఎన్నికల కోడ్ అమలు .. రంగంలోకి ప్రత్యేక బృందాలు

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి కోడ్ పటిష్ఠంగా అమలు చేయాలని గురువారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు మండలానికి ఒక ఎంపీడీఓ, తహశీల్దార్తో పాటు వీడియోగ్రాఫర్లతో కూడిన 30 ఎంసీసీ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.
Similar News
News December 6, 2025
విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.
News December 6, 2025
సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్నాయుడు

దేశ రక్షణలో అమరులైన, విధీ నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరు ఉదారంగా విరాళాలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన ముందుగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రవికుమార్, కలెక్టర్ పాల్గొన్నారు.
News December 6, 2025
సారవకోట: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.


