News September 27, 2024
శ్రీకాకుళం: ఎస్పీని కలిసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డిని, శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా.ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ను విధి నిర్వహణలో బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన కోరారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
Similar News
News October 10, 2024
శ్రీకాకుళం: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లకు ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న ఎలినేషన్స్ పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నది తెలుసుకోవాలని చెప్పారు.
News October 10, 2024
దువ్వాడ మీదుగా విజయవాడ – శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు
దసరా రద్దీ దృష్ట్యా విజయవాడ – శ్రీకాకుళం రోడ్ మధ్య దువ్వాడ మీదుగా కొన్ని రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07215 ఈనెల 10, 11,12,14,15,16,17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలునంబర్ 07216 ఈనెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో ఉదయం 6.30కి బయలుదేరి విజయవాడ చేరుతుంది.
News October 10, 2024
కలెక్టర్, ఎస్పీతో చర్చించిన ఎంపీ కలిశెట్టి
విజయనగరం పైడితల్లి ఉత్సవాల నిర్వహణపై భక్తుల సలహాలు సూచనలు కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో చర్చించారు. అమ్మవారి ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.