News April 15, 2025

శ్రీకాకుళం: ఏపీ మోడల్ పాఠశాల పరీక్షల తేదీ మార్పు

image

ఏపీ మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు తేదీ ఏప్రిల్ 21కి మార్పు జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీన “ఈస్టర్” పండగ ఉండటం వలన తేదీ మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గల 13 మోడల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 21కి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.

Similar News

News November 21, 2025

శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

image

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.

News November 21, 2025

SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

image

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.

News November 21, 2025

సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్‌కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.