News July 12, 2024

శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి 1,110 మంది ఎంపిక

image

శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి సంబంధించి 1,110 మంది ఎంపికైనట్లు డైరెక్టర్ ప్రొ. బాలాజీ, పరిపాలనా అదికారి. ముని రామకృష్ణ తెలిపారు. వీరిలో 685 మంది అమ్మాయిలు, 325 మంది అబ్బాయిలు, ప్రత్యేక కేటగిరీ కింద 100 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వారు తెలిపారు. విద్యార్థులు కౌన్సలింగ్‌కు హాజరు కావాలన్నారు.

Similar News

News January 3, 2026

దువ్వాడ అడుగు ఎటువైపు ?

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 3, 2026

శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

image

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <>లింక్‌పై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News January 3, 2026

మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

image

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.