News April 6, 2024
శ్రీకాకుళం: కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మందస మండలం చిక్కిడిగాం గ్రామంలో చోటుచేసుకుంది. భర్త కృష్ణ జీడి తోటకు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, కడుపు నొప్పి తీవ్రంగా ఉందంటూ భార్య సంగీత చెప్పింది. ఏమైందని కృష్ణ అడగగా కడుపునొప్పి తాళలేక గన్నేరు పప్పు తాగానని తెలపడంతో వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది.
Similar News
News January 15, 2025
మెళియాపుట్టిలో వారికి కనుమ రోజే భోగి
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
News January 15, 2025
సోంపేటలో పోలీస్ జాగిలాల విస్తృత తనిఖీలు
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
News January 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సినీ నటుడు
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.