News December 8, 2024

శ్రీకాకుళం: కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యిరాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్ చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News March 17, 2026

శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.

News March 17, 2026

SKLM: ‘ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలి’

image

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News March 17, 2026

SKLM: ‘ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలి’

image

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.