News October 28, 2024

శ్రీకాకుళం కార్తీకమాస మహోత్సవాలకు సిద్ధం

image

శ్రీకాకుళం జిల్లాలో కార్తీకమాస మహోత్సవాలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు..అరసవల్లి- సూర్యనారాయణ స్వామి ఆలయం, టెక్కలి- రావివలస ఎండల మల్లన్న స్వామి దేవాలయం, గార- శ్రీకూర్మం, సాలిహుండం,జలుమూరు- శ్రీముఖలింగం,మందస- మహేంద్ర గిరి పాదాలు.ఆలయాలు సుందరంగా ముస్తాబు అవుతున్నాయి. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News November 14, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్‌లుగా పాఠశాల ప్రాంగణాలు

News November 14, 2025

SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

image

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.

News November 14, 2025

నౌకా నిర్మాణ హబ్‌‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌: CM

image

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.