News June 4, 2024
శ్రీకాకుళం: ‘కింజరాపు కుటుంబంలో అందరూ గెలిచారు’

కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.
Similar News
News October 18, 2025
SKLM: అంబేడ్కర్ గురుకుల హాస్టళ్ల పనులు వేగవంతం చేయండి

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.
News October 17, 2025
పలాస: అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించాలి

అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా SP కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.టెక్కలి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకోసం ఈప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ, ఆస్తి గొడవలు వంటివాటిపై దరఖాస్తులు అందాయన్నారు.