News June 4, 2024

శ్రీకాకుళం: ‘కింజరాపు కుటుంబంలో అందరూ గెలిచారు’

image

కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్‌తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.

Similar News

News November 27, 2025

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 27, 2025

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025

టెక్కలి: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.