News September 28, 2024

శ్రీకాకుళం: కేరళ ముఖ్యమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి

image

కేరళ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విస్తరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వి.అబ్దురేహిమాన్ లతో చర్చలు జరిపారు. చిన్న విమానాశ్రయాలను మరింత బలోపేతం చేయడానికి, కేరళను అనుసంధానించేందుకు ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.

Similar News

News December 1, 2025

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం SP

image

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఆరోగ్యం పరిరక్షణ కోసం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని SP మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో పోలీసు సిబ్బందికి డాక్టర్ల బృందం జనరల్ చెకప్‌తోపాటు షుగర్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు వంటివి చేశారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బంది సమాజానికి అవసరమన్నారు.

News December 1, 2025

టెక్కలి: డయేరియా ఘటనపై CM ఆరా.!

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డయేరియా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. CM చంద్రబాబు సోమవారం సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో ప్రబలుతున్న డయేరియాపై ఆరోగ్యశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. తాగునీటిని పరీక్షించాలని ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమీప గ్రామాలను సైతం అప్రమత్తం చేయాలన్నారు.

News December 1, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.