News July 14, 2024

శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ ఆగస్టు 2, 3, 5, 7, 9, 10వ తేదీలలో విజయవాడ-ఏలూరు మీదుగా కాక రాయనపాడు-గుడివాడ- భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

ఎచ్చెర్ల: లా కోర్సు మిగులు సీట్లు భర్తీ వాయిదా

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 4 న చేపట్టనున్న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ అడ్డయ్య ప్రకటన విడుదల చేశారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్స్లో భాగంగా గురువారం విద్యార్థుల సర్టీఫికేట్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం తదుపరి తేదీ ప్రకటించే పరిశీలనను వాయిదా వేస్తున్నామన్నారు.

News December 3, 2025

శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

image

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.

News December 3, 2025

ఎచ్చెర్ల: మహిళ హత్య?

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.