News June 2, 2024
శ్రీకాకుళం: కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా

స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. చిలకపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూంలను ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, ఎప్పీ రాధికతో పాటు నియోజకవర్గాల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహీల్, మాలతుస్ ఎస్.సంగమ్, అనుజ కుమార్ దాస్ తనిఖీ చేశారు. పలు అంశాలపై చర్చించారు.
Similar News
News November 27, 2025
యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదు: మంత్రి అచ్చెన్న

రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులు సమీక్షా నిర్వహించారు. రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 27, 2025
SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.
News November 27, 2025
SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.


