News January 28, 2025

శ్రీకాకుళం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

కోటబొమ్మాళి మండలం పాడుగుపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బోరుమజ్జిపాలేనికి చెందిన కరుకోల శ్రీనివాసరావు (55) పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై వి సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Similar News

News October 23, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈తాడేపల్లి ప్యాలెస్ నుంచి కల్తీ మద్యం సరఫరా: ఎమ్మెల్యే మామిడి
◈ టెక్కలి: నందెన్న ఊరేగింపులో ఘర్షణ..ఇద్దరిపై కేసు నమోదు
◈ మందస: చాపరాయి భూ సమస్యపై న్యాయం చేయాలి
◈అధ్వానంగా సరుబుజ్జిలి, కొత్తూరు ప్రధాన రహదారులు
◈ శ్రీకాకుళం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
◈ సింధూర జలసిరిపై పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
◈ఎల్.ఎన్ పేట: శవ దహనానికి సవాలక్ష పాట్లు
◈ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న

News October 23, 2025

నరసన్నపేట: నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన నరసన్నపేటలోని దేశవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన జనార్ధన్ (45) గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగులేదు. బుధవారం ఉదయం కనిపించకపోగా కుటుంబీకులు వెతికారు. సాయంత్రం నెలబావిలో శవమై తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.

News October 23, 2025

టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

image

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.