News April 3, 2024

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

పలాస మండలం లక్ష్మీపురం సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి తర్వాత ఎదురుగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఐచర్ వ్యాన్ అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వ్యాన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని
తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇరుక్కున్న డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకి తీసి, చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 14, 2025

నౌకా నిర్మాణ హబ్‌‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌: CM

image

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.

News November 14, 2025

SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.

News November 13, 2025

ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

image

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.