News April 5, 2025

శ్రీకాకుళం జిల్లాకు పిడుగుల ముప్పు

image

ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

Similar News

News April 9, 2025

SKLM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గరలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ (న్యాక్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఉంటుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ బుధవారం తెలిపారు. ఎస్సీ యువతీ, యువకులకు ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్/డిగ్రీ చదివిన అర్హులుగా పేర్కొన్నారు. 2 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు.

News April 9, 2025

కోటబొమ్మాళి: ‘పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టండి’

image

పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదాను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళిలో పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్ ఆధునీకరించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

News April 9, 2025

తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

image

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. 

error: Content is protected !!