News October 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు హెచ్చరికలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకపోవడం మంచిది.

Similar News

News October 17, 2024

ఆదిత్యుని సేవలో తనికెళ్ల భరణి

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఆలయ డీసీ వై.భాద్రజీ పాల్గొన్నారు.

News October 17, 2024

ఇసుక రీచ్ సీల్డ్ టెండర్లకు రేపే చివరి అవకాశం

image

శ్రీకాకుళం జిల్లాలో మరో 6 రీచ్‌ల నిర్వహణ హక్కులకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్టు మైన్స్ శాఖ DD మోహనరావు తెలిపారు. పురుషోత్తపురం-1, పురుషోత్తమపురం-2 (సరుబుజ్జిలి), ముద్దాడపేట (ఎచ్చెర్ల), కిల్లిపాలెం(శ్రీకాకుళం), ముద్దాడపేట(అమదాలవలస), పర్లాం(నరసన్నపేట) రీచ్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18న ఉదయం11 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.

News October 17, 2024

ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం నీడలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం ఉందని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఈ విభాగం పని చేస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు మాట్లాడుతూ.. ట్రామాకేర్‌లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారన్నారు.