News April 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు 23వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16,926 మంది పరీక్షలు రాయగా 12,532 మంది పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 23 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18,574 మందికి 11,733 మంది పాసయ్యారు. 63శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది.

Similar News

News January 25, 2026

SKLM: 10Th పాసైనా ఉద్యోగం

image

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 27న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కే.సుధ శనివారం తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వెనుక ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎంపికలు ఉంటాయన్నారు. పేటీఎం సంస్థలో (10th పాస్‌తో) 55 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్ట్‌లు, సోలార్ ఎనర్జీలో (డిగ్రీతో) సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌లు ఉన్నాయన్నారు. అభ్యర్థులకు 18 ఏళ్ల వయసు నిండాలన్నారు.

News January 24, 2026

జలమూరులో యాక్సిడెంట్ స్పాట్‌లో ఒకరు మృతి

image

జలుమూరు మండలం చల్లవానిపేట చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 14 ఏళ్ల బాలుడు ఋషి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చోదకుడితో పాటు బైక్‌పై ఉన్న వారికి గాయాలవ్వడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 24, 2026

SKLM: నేటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు..!

image

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.