News March 19, 2024
శ్రీకాకుళం జిల్లాలో ఈవోపై కమిషనర్ ఆగ్రహం

ఆరసవల్లి సూర్యనారాయణ ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్రెడ్డిపై దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ మండిపడ్డారు. రావివలసకు చెందిన అటెండర్ శ్రీనివాసరావు డిప్యూటేషన్పై ఆదిత్యాలయంలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట గడువు ముగియడంతో ఆయన మరోసారి కమిషనర్ ఆర్డర్ తీసుకుని వెళ్లగా ఆరసవెళ్లి ఈవో విధుల్లోకి తీసుకోలేదు. విషయం కమిషనర్కు తెలిసి అటెండర్ను తక్షణమే విధుల్లోకి తీసుకోకుంటే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు.
Similar News
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.
News January 15, 2026
సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర


